తెలుగు రాష్ట్రాల్లో నడిచే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ స్పెషాలిటీస్, టికెట్ ధరలు ఇవే...

సెమీ బుల్లెట్‌ గా పేరు తెచ్చుకున్న వందేభారత్‌ ట్రైన్ తెలుగు రాష్ట్రాల్లో ఎంట్రీ ఇచ్చింది.ఈ ట్రైన్ సికింద్రాబాద్ – విశాఖ మధ్య నడుస్తుంది.

 Vande Bharat Express Train Specialties And Ticket Prices Running In Telugu State-TeluguStop.com

సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వరకు 698 కిలోమీటర్లు ఉండగా.వందే భారత్ ట్రైన్‌కు ఆ డిస్టెన్స్ కవర్ చేయడానికి 8 గంటల 40 నిమిషాలు పడుతుంది.

ఇది పట్టాల పరిమితిని బట్టి 130 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది.ఫుల్లీ సస్పెండెడ్‌ ట్రాక్షన్‌ మోటార్‌తో డిజైన్ చేసిన ఈ ట్రైన్ ఎంత వేగంగా వెళ్ళినా కుదుపులు ఉండవు.

దీనివల్ల ఈ ట్రైన్ జర్నీ చాలా వేగంగా, ఫాస్ట్‌గా, సుఖవంతంగా ఉంటుంది.అయితే ఇన్ని ప్రయోజనాలు అందించే దీని టికెట్ ధర సాధారణ ట్రైన్ లో టికెట్ ధరకంటే కాస్త ఎక్కువగానే ఉంది వాటిపై ఇప్పుడు ఒక లుక్కేద్దాం.

• విశాఖ టు రాజమండ్రి టు ఛైర్ కారు టికెట్ ధర రూ.625 కాగా ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ప్రైస్ రూ.1215

విశాఖ టు విజయవాడ టు ఛైర్ కారు టికెట్ ధర రూ.960, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధర రూ.1825

• విశాఖ టు ఖమ్మం టు ఛైర్ కారు ధర రూ.1115, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధర రూ.2130

విశాఖ టు వరంగల్ టు ఛైర్ కారు టికెట్ ధర రూ.1310, ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధర రూ.2540

విశాఖ టు సికింద్రాబాద్ ఛైర్ కారు టికెట్ ధర రూ.1720.ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్ ధర రూ.3170

ఈరోజు నడిచే ఈ వందే భారత్ ట్రైన్ టైమింగ్స్ తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఎంక్వయిరీ చేయవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube