తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు అధికారంలోకి వచ్చే అవకాశం లేదని మంత్రి హరీశ్ రావు అన్నారు.బీజేపీలో చేరితే రాజకీయాల్లో ఆత్మహత్య చేసుకున్నట్లేనని తెలిపారు.
అయినా ఖమ్మం ప్రజలు బీజేపీకి అవకాశం ఇవ్వరని పేర్కొన్నారు.తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం వైపే ఉన్నారని వెల్లడించారు.కాగా ఈనెల 18న ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ తొలి బహిరంగ సభను నిర్వహించనున్నారు.
ఈ మేరకు సభ ఏర్పాట్లను మంత్రి హరీశ్ రావు స్వయంగా పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే.







