బెంగళూరులో విషాద ఘటన జరిగింది.నిర్మాణంలో ఉన్న మెట్రో పిల్లర్ ఒక్కసారిగా కుప్పకూలింది.
అయితే మెట్రో పిల్లర్ అటుగా వస్తున్న బైకుపై కూలినట్లు తెలుస్తోంది.ఈ ప్రమాదంలో బైకుపై ప్రయాణిస్తున్న తల్లి, కొడుకు తీవ్రగాయాల పాలైయ్యారు.
వెంటనే గమనించిన స్థానికులు బాధితులను హుటాహుటిన ఆస్పత్రిక తరలించారు.కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృత్యువాత పడినట్లు సమాచారం.
అయితే 40 శాతం కమిషన్ ప్రభుత్వం వల్లే ప్రమాదం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.అదేవిధంగా ఘటనకు ప్రభుత్వం బాధ్యత తీసుకుంటూ బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.







