సునీల్ కనుగోలు హాజరుపై మరోసారి సందిగ్ధత..!

తెలంగాణ కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరుకావడంపై మరోసారి సందిగ్ధత నెలకొంది.పోలీసులు అందజేసిన నోటీసుల ప్రకారం ఇవాళ విచారణకు ఆయన హాజరుకావాల్సి ఉంది.

 Sunil Kanugulu's Attendance Is Once Again Doubtful..!-TeluguStop.com

ఈ సందర్భంగా సైబర్ క్రైమ్ ఏసీపీ మాట్లాడుతూ సునీల్ కనుగోలుకు నోటీసులు అంజదేశామని తెలిపారు.విచారణకు సహకరించాలని ఇటీవలే హైకోర్టు ఆదేశాలు ఇవ్వగా విచారణకు వస్తానని సునీల్ సమాచారమిచ్చారని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో సునీల్ కనుగోలు వస్తే విచారించడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.అయితే, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు సునీల్ కనుగోలుకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube