సీఎం కేసీఆర్‎పై బీజేపీ ఎంపీ జీవీఎల్ ఫైర్

తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎంపీ జీవీఎల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.గతంలో ఆంధ్రులను తరిమికొడతానన్న కేసీఆర్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఏపీకి వస్తున్నారని ప్రశ్నించారు.

 Bjp Mp Gvl Fires On Cm Kcr-TeluguStop.com

ఆంధ్రులకు బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే కేసీఆర్ ఏపీలో అడుగుపెట్టాలని తెలిపారు.ఆంధ్రా పార్టీలు, నాయకత్వం వద్దన్న కేసీఆర్ కు ఇక్కడ పనేంటని నిలదీశారు.

తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం ఖాయమని జీవీఎల్ ధీమా వ్యక్తం చేశారు.

ఆంధ్రాకు కేసీఆర్ చేసిన ద్రోహాన్ని ప్రజలు మర్చిపోరని తెలిపారు.

అధికారంలోకి వస్తే పోలవరం కడతామనడం సిగ్గుచేటని వ్యాఖ్యనించారు.పోలవరంపై కేసీఆర్ కోర్టులో కేసులు వేశారని, శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి కోసం నీళ్లను సముద్రం పాలు చేశారని మండిపడ్డారు.

కేసీఆర్ చర్యల వలన ఏపీకి తీవ్ర నష్టం జరుగుతోందని వెల్లడించారు.బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా త్వరలో ఏపీకి సీఎం కేసీఆర్ వెళ్లనున్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube