తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎంపీ జీవీఎల్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.గతంలో ఆంధ్రులను తరిమికొడతానన్న కేసీఆర్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఏపీకి వస్తున్నారని ప్రశ్నించారు.
ఆంధ్రులకు బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాతే కేసీఆర్ ఏపీలో అడుగుపెట్టాలని తెలిపారు.ఆంధ్రా పార్టీలు, నాయకత్వం వద్దన్న కేసీఆర్ కు ఇక్కడ పనేంటని నిలదీశారు.
తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం ఖాయమని జీవీఎల్ ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రాకు కేసీఆర్ చేసిన ద్రోహాన్ని ప్రజలు మర్చిపోరని తెలిపారు.
అధికారంలోకి వస్తే పోలవరం కడతామనడం సిగ్గుచేటని వ్యాఖ్యనించారు.పోలవరంపై కేసీఆర్ కోర్టులో కేసులు వేశారని, శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి కోసం నీళ్లను సముద్రం పాలు చేశారని మండిపడ్డారు.
కేసీఆర్ చర్యల వలన ఏపీకి తీవ్ర నష్టం జరుగుతోందని వెల్లడించారు.బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా త్వరలో ఏపీకి సీఎం కేసీఆర్ వెళ్లనున్న సంగతి తెలిసిందే.