సాధారణంగా సంక్రాంతి అంటేనే తెలుగు వారికి ఎంతో ముఖ్యమైన పండగ అలాగే సినిమా సెలబ్రిటీలకు కూడా ఈ పండుగ ఎంతో ముఖ్యమైనది.సంక్రాంతి పండుగ సందర్భంగా ఎన్నో సినిమాలు బరిలోకి దిగి నువ్వా నేనా అంటూ పోటీ పడుతుంటాయి.
క్రమంలోని ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా పేరు సంపాదించుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి బాలకృష్ణ ఇద్దరు పోటీకి సై అంటున్నారు.మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి చిత్రాలు రెండు సంక్రాంతికి విడుదల కానున్నాయి.
ఇలా ఈ రెండు చిత్రాలు మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం.అయితే ఈ రెండు సినిమాలు సంక్రాంతికి విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా ఒక అడుగు ముందుకెళ్లి పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.అయితే వాల్తేరు వీరయ్య కోసం కూడా మెగా అభిమానులతో పాటు మెగా బ్రదర్ నాగబాబు సైతం రంగంలోకి దిగారు.

ఈ క్రమంలోనే హైదరాబాద్ బేగంపేట హరిత ప్లాజాలో మెగా ఫ్యాన్స్ సమావేశం నిర్వహించారు.రెండు తెలుగు రాష్ట్రాల నుంచి, కర్ణాటక నుంచి కూడా మెగా అభిమానులు వచ్చారు.ఈ కార్యక్రమంలో మెగా బ్రదర్ నాగబాబుతో పాటు ఈ చిత్రం దర్శక నిర్మాతలు కూడా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా నాగబాబు మాట్లాడుతూ.అభిమానులు ఎవరూ కూడా నిర్మాతలతో గొడవ పడకూడదని కేవలం వారికి సలహాలు సూచనలు మాత్రమే ఇవ్వాలని తెలిపారు.ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో థియేటర్ల ఇష్యూ ఉంది.
ఈ క్రమంలోని థియేటర్ల గురించి నాగబాబు మాట్లాడుతూ.వాల్తేరు వీరయ్య సినిమా ఎక్కువ థియేటర్లలో విడుదల అయ్యేలా చూస్తామని తెలిపారు.
ఇక మెగా ఫాన్స్ కి తాను ఎప్పుడూ అండగా ఉంటానని ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు.అందరూ కలిసికట్టుగా ఉండి సినిమా విజయానికి దోహదపడాలని ఈ సందర్భంగా నాగబాబు చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







