ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగ్గుస్వామి సోదరుడి పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.జగ్గుస్వామి సోదరుడు మనీలాల్ సింగ్ బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ చేపట్టింది.
ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేసేందుకు వచ్చే బుధవారం వరకు సమయం ఇవ్వాలని సిట్ కోర్టును కోరింది.సముఖత వ్యక్తం చేసిన ధర్మాసనం తదుపరి విచారణను ఈనెల 28కి వాయిదా వేసింది.







