హిల్ఫోర్ట్ ప్యాలెస్ పునరుద్ధరణలో జాప్యంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది.ఈ విచారణకు ఆర్థిక, పర్యాటకశాఖ కార్యదర్శులతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ హాజరైయ్యారు.
నీతి ఆయోగ్ సమావేశం ఉన్నందున విచారణకు హాజరుకాలేమని సీఎస్ కోర్టుకు తెలిపారు.తదుపరి విచారణకు అరవింద్ కుమార్ తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ హాజరుకావాలని న్యాయస్థానం ఆదేశించింది.
అనంతరం తదుపరి విచారణను జనవరి 10వ తేదీకి వాయిదా వేసింది.







