ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో నిందితుల స్టేను తెలంగాణ హైకోర్టు పొడిగించింది.ఈ క్రమంలో బీఎల్ సంతోష్, జగ్గుస్వామితో పాటు తుషార్ కు స్టే పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ నెల 30 వరకు స్టే పెంచినట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది.ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఈ విచారణలో భాగంగా ఇప్పటికే అధికారులు పలువురికి సిట్ నోటీసులు అందించారు.







