బీజేపీపై తాండూరు ఎమ్మెల్యే ఫైలెట్ రోహిత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.ఛార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయానికి చేరుకున్నారు.
బెంగళూరు డ్రగ్స్ కేసులో బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన ఆరోపణలు నిరూపించాలని, ఈ నేపథ్యంలో ఆలయానికి రావాలంటూ రోహిత్ రెడ్డి సవాల్ చేసిన విషయం తెలిసిందే.అయితే డ్రగ్స్ కేసులో రేపు విచారణకు హాజరుకావాలని రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు అందించింది.
భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం రోహిత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీపై తీవ్రంగా మండిపడ్డారు.బీజేపీ నేతలకు అబద్ధాలు చెప్పడం వెన్నతో పెట్టిన విద్యన్నారు.
కావాలనే అసత్య ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.బీజేపీ నేతలు తన సవాల్ ను స్వీకరించలేదంటే బండి సంజయ్ చేసిన ఆరోపణలు తప్పని అందరికీ అర్థమైందని తెలిపారు.
ఈడీ, ఐటీ, సీబీఐ పేర్లతో ఇబ్బందులు పెడుతున్నారని విమర్శించారు.