వైసీపీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ క్రమంలో సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు.మార్చిలో తదుపరి సమావేశం ఉంటుందన్నారు.
అప్పటిలోగా పనితీరు మెరుగుపర్చుకోవాలని సూచించారు.రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పెంపు కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించాలన్న జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పి పెన్షన్ పెంపును వివరించాలని తెలిపారు.
అయితే 32 మంది ఎమ్మెల్యేల పని తీరు సరిగాలేదని సీఎం జగన్ కు నివేదిక అందిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ప్రతి సచివాలయంలో కనీసం 6 గంటల పాటు ఎమ్మెల్యేలు ఉండాలని జగన్ స్పష్టం చేశారు.







