తెలుగు సినిమా ఇండస్ట్రీ లో లెజెండ్స్ అని చెప్పుకోదగ్గ వ్యక్తుల్లో రామానాయుడు గారు ఖచ్చితం గా ఉంటారు.అయన సినిమా అంటే ఇష్టంతో తన ఇద్దరు కుమారులు పుట్టగానే చెన్నై లో వెళ్లి స్నేహితులతో కలిసి సినిమా నిర్మాణం చేపట్టారు.
అక్కడ నుంచి మొదలైన సినిమా ప్రస్థానం ఎన్నో ఏళ్ళ పాటు నిర్విరామంగా జరిగింది.ఇక అయన లెగసి ని కొడుకులు, మనవలు ముందుకు తీసుకెళ్తున్నారు .పెద్ద కొడుకు సురేష్ బాబు నిర్మాతగా అడుగు పెట్టి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కొనసాగుతున్నాడు.ఇక వెంకటేష్ మాత్రం హీరో గా వచ్చి విక్టరీ అనే పదాన్ని తన పేరుకు ముందు యాడ్ చేసేంత పెద్ద స్టార్ గా ఎదిగాడు.
ఇక అయన మనవాళ్ళు రానా, అభిరాం సైతం హీరోలుగా రాణిస్తున్నారు.
ఇదంతా మనకు తెలిసిన విషయమే.
అయితే రామానాయుడికి ఇద్దరు కొడుకులు ఉంటె ఒకరికి సినిమా తీయమని, మరొకరిని సినిమా చేయమని ఎందుకు ఎంకరేజ్ చేసారు అనే విషయం మాత్రం ఎవరికి తెలియదు.కానీ ఇటీవల సురేష్ బాబు బాలయ్య బాబు తో అన్ స్టాపబుల్ షో లో పాల్గొన్నారు.
ఈ షో లో అయన ఈ ప్రశ్న కు సమాధానం ఇచ్చారు.రామానాయుడు లాంటి ఒక లెజెండ్ కి ఎవరిని ఎలా డీల్ చేయాలో బాగా తెలుసు.
అందుకే బాగా తెలివి ఉన్న వాడు అని పెద్ద కొడుకు అయినా సురేష్ బాబు పైన నమ్మకం ఉండటం తో సినిమా ప్రొడక్షన్ అయన చేతిలో పెట్టారు.
నిజానికి సురేష్ బాబు సైతం మంచి అందగాడు,.ఆ రోజుల్లో హీరోగా వచ్చి ఉంటె వెంకటేష్ కన్నా పెద్ద హీరో అయ్యేవారు.కానీ ప్రొడక్షన్ చేయాలంటే అన్ని విభాగాల్లో పట్టు ఉండాలి.
డబ్బు మ్యానేజ్ చేయాలి.థియేటర్స్ ని హోల్డ్ చేయాలి.
ఇన్ని చేయాలంటే మంచి సమయస్పూర్తి, తెలివి తేటలు ఉండాలి .అవి సురేష్ బాబు లో ఉన్నాయని రామానాయుడు నమ్మరు.అందుకే ఆలా ప్రొడక్షన్ లో కి పంపించారు.ఇక వెంకటేష్ చాల అమాయకుడు అని రామానాయుడు నమ్మరు.ఎవరినైనా నమ్మి మోసపోతారేమో అని అలాగే హైట్, పర్సనాలిటీ ఉంది కాబట్టి వెండి తెరపైన బ్రతుకుతాడు అని హీరోగా చేసాడు.రామానాయుడు వేసిన ఈ లెక్క ఎక్కడ తప్పలేదు.