తెలంగాణలో మెడికల్ కాలేజీలకు పోస్టులు మంజూరు అయ్యాయి.ఈ మేరకు పలు కేటగిరీల్లో తొమ్మిది కాలేజీలకు 3,897 పోస్టులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఒక్కో మెడికల్ కాలేజీ కోసం 433 పోస్టులు మంజూరు చేసింది ప్రభుత్వం.రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, కరీంనగర్, భూపాలపల్లి, ఆసిఫాబాద్, నిర్మల్ తో పాటు జనగాం జిల్లాల్లోని మెడికల్ కాలేజీలకు పోస్టులు మంజూరు అయ్యాయి.