టెక్నాలజీ ప్రస్తుత ఆధునిక యుగంలో బాగా అభివృద్ధి చెందింది.ఈ తరుణంలో మనుషుల బయో ఆర్గాన్లను కూడా తయారు చేయడానికి ప్రయోగాలు జరుగుతున్నాయి.
అది కూడా మన భారత్లోనే అంటే నమ్మతారా.కానీ ఇది నిజం.
ఇండియన్ టెక్ స్టార్టప్ అవయ్ బయోసైన్సెస్ ఇటీవల మానవ కణజాలాలను ప్రింట్ చేయగల స్వదేశీ అత్యాధునిక బయో 3డి ప్రింటర్ను ‘మిటో ప్లస్’ని విడుదల చేసింది.మిటో ప్లస్ మొదటి నమూనా బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ప్రదర్శించారు.
ఇటీవల జరిగిన బెంగళూరు టెక్ సమ్మిట్ సందర్భంగా మిటోప్లస్ను ప్రారంభించారు.మిటో ప్లస్ అనేది డాక్టర్ బిక్రమ్జిత్ బసు పరిశోధన ల్యాబ్ నుండి ప్రోటోటైప్పై ఇన్పుట్లతో అభివృద్ధి చేయబడిన బయో 3డీ ప్రింటర్ అధునాతన వెర్షన్.
ఐఐఎస్సీ, అవే కంపెనీ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.

అవే కంపెనీని ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి సుహృద్ సుందరం సహ-స్థాపించారు.అవే బయోసైన్సెస్ భారతదేశంలో ఎండ్-టు-ఎండ్ బయో 3డీ ప్రింటింగ్ సొల్యూషన్స్ కోసం సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రెండింటిని పూర్తిగా స్వదేశీ అభివృద్ధిని అందిస్తుంది.స్టార్టప్ ఇప్పటికే ఐఐటీ మద్రాస్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ICT), ముంబై, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (NIPER), హైదరాబాద్ మరియు BITS పిలానీ (గోవా క్యాంపస్)తో సహా భారతదేశం అంతటా ప్రీమియర్ R&D ఇన్స్టిట్యూట్లతో భాగస్వామ్యం కలిగి ఉంది.
సహకారులు.వివిధ బయోప్రింటింగ్ మార్కెట్ నివేదికల ప్రకారం, గ్లోబల్ 3D బయోప్రింటింగ్ మార్కెట్ ప్రస్తుతం 2022 నాటికి USD 1.3 బిలియన్ల విలువను కలిగి ఉంది.2027 నాటికి 3.3 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేయబడింది.ఫార్మాస్యూటికల్ మరియు కాస్మోటాలజీ పరిశ్రమలలో భారీ డిమాండ్ కనిపిస్తుంది.
వీరి ఆవిష్కరించిన మిటో ప్లస్ను ఫార్మాస్యూటికల్ డ్రగ్ డిస్కవరీ, డ్రగ్ టెస్టింగ్ అప్లికేషన్ కోసం ఉపయోగించవచ్చు.దీనిని క్యాన్సర్ బయాలజీ మరియు కాస్మోటాలజీ అప్లికేషన్లలో కూడా వినియోగించవచ్చు.
ఇలాంటి బయోప్రింటర్లు ఇతర 3డి ప్రింటర్ల మాదిరిగానే దాదాపు ఒకే విధంగా పనిచేస్తాయి.బయోప్రింటర్లు చర్మ కణజాలం, కాలేయ కణజాలం మొదలైన సంక్లిష్ట నిర్మాణాలను నిర్మించడానికి జీవ కణాలను కలిగి ఉండే బయోమెటీరియల్ల పొరను సృష్టిస్తాయి.3డీ బయోప్రింటింగ్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా మానవాళికి ఒక ప్రత్యేకమైన బహుమతి.Avay Biosciences 3D ప్రింటర్లను చెన్నై, బెంగళూరులో దాదాపు 70 శాతం తయారీతో అంతర్గతంగా అభివృద్ధి చేసింది.
మానవాళికి సంబంధించిన కృత్రిమ అవయవాల తయారీలో ముందడుగు వేసింది.







