వైసీపీ నేత కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు

గుడివాడలో పోటీలపై వైసీపీ నేత, మాజీమంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.గుడివాడలో చంద్రబాబు, లోకేశ్ పోటీ చేసినా తానే పోటీకి దిగుతానని చెప్పారు.

 Interesting Comments Of Ycp Leader Kodali Nani-TeluguStop.com

ఎప్పుడైనా ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించేది ప్రజలేనని తెలిపారు.ఎన్నారైలు, రాజకీయ విశ్లేషకులు గెలుపును నిర్ణయించరని స్పష్టం చేశారు.

అదేవిధంగా వందల కోట్ల డబ్బు తెస్తే గుడివాడ ప్రజలు అమ్ముడు పోరని వెల్లడించారు.కుల సంఘాల చందా డబ్బులు వేల కోట్లు తెచ్చినా చివరి రక్తపు బొట్టు వరకు వైసీపీ గెలుపు కోసం పోరాడుతానని పేర్కొన్నారు.

చంద్రబాబును మించిన సైకో మరొకరు లేరని, ఆయన సీఎం కాకపోతే ప్రజలకు పోయేదేమి లేదని చెప్పారు.బతికున్నంత కాలం జగనే ముఖ్యమంత్రిగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు.

చంద్రబాబుకే కాదు.టీడీపీకీ ఇవే చివరి ఎన్నికలని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube