గుడివాడలో పోటీలపై వైసీపీ నేత, మాజీమంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.గుడివాడలో చంద్రబాబు, లోకేశ్ పోటీ చేసినా తానే పోటీకి దిగుతానని చెప్పారు.
ఎప్పుడైనా ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించేది ప్రజలేనని తెలిపారు.ఎన్నారైలు, రాజకీయ విశ్లేషకులు గెలుపును నిర్ణయించరని స్పష్టం చేశారు.
అదేవిధంగా వందల కోట్ల డబ్బు తెస్తే గుడివాడ ప్రజలు అమ్ముడు పోరని వెల్లడించారు.కుల సంఘాల చందా డబ్బులు వేల కోట్లు తెచ్చినా చివరి రక్తపు బొట్టు వరకు వైసీపీ గెలుపు కోసం పోరాడుతానని పేర్కొన్నారు.
చంద్రబాబును మించిన సైకో మరొకరు లేరని, ఆయన సీఎం కాకపోతే ప్రజలకు పోయేదేమి లేదని చెప్పారు.బతికున్నంత కాలం జగనే ముఖ్యమంత్రిగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు.
చంద్రబాబుకే కాదు.టీడీపీకీ ఇవే చివరి ఎన్నికలని తెలిపారు.