డబ్బింగ్ సినిమాల విడుదలపై తెలుగు నిర్మాతలు స్పందించారు.ఈ మేరకు తమ వైఖరిని ప్రొడ్యూసర్స్ మరోసారి స్పష్టం చేశారు.
పండగలకు తెలుగు సినిమాలే విడుదల చేయాలనేది తమ డిమాండ్ కాదని స్పష్టం చేశారు.కానీ తొలి ప్రాధాన్యత తెలుగు సినిమాకు ఇచ్చిన తర్వాత డబ్బింగ్ సినిమాలకు ఇవ్వాలనేది తమ అభిప్రాయమని పేర్కొన్నారు.2017లో చేసిన తీర్మానం చెల్లుబాటులో లేదన్నారు.ఇదే అంశంపై అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు.
డబ్బింగ్ సినిమాలను అడ్డుకోవడం సాధ్యం కాదని, చిత్రంలో దమ్ముంటే భాషాభేదం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని వెల్లడించారు.నార్త్, సౌత్ అనే భేదం లేదని స్పష్టం చేశారు.