సంగారెడ్డి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ నేతలు నిర్వహించిన బైక్ ర్యాలీలో అపశృతి నెలకొంది.ర్యాలీ సందర్భంగా బాణా సంచా పేల్చారు పార్టీ శ్రేణులు.
ఈ క్రమంలోనే బాణాసంచా పేల్చుతుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది.ఈ ప్రమాదంలో పలువురికి తీవ్రంగా గాయపడ్డారని సమాచారం.
గమనించిన స్థానికులు వెంటనే బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.కాగా వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
జిల్లాలో మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.