ఐబీఎస్ ర్యాగింగ్ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు.ఇందులో భాగంగా ఐదుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.
ఓ మతాన్ని కించపరిచే విధంగా మెసేజ్ పెట్టడంతో వివాదం మొదలైందని సమాచారం.ఈ క్రమంలో జూనియర్ పై పది మంది సీనియర్ విద్యార్థులు దాడికి పాల్పడ్డారు.
ర్యాగింగ్ ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యం వహించినట్లు పోలీసులు గుర్తించారు.దీంతో కాలేజీ యాజమాన్యాన్ని కూడా ఎఫ్ఐఆర్ లో చేర్చనున్నట్లు పోలీసులు వెల్లడించారు.