సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే సర్కారు వారి పాట సినిమాతో ఘన విజయం అందుకున్నాడు.మరి ఈ సినిమా విజయం సాధించిన తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో నెక్స్ట్ సినిమా కమిట్ అయ్యాడు.
ఈ కాంబో ఇప్పటికే రెండు సార్లు కలిసి సినిమాలు చేసారు.ఇక ఇప్పుడు మూడవసారి ఈ కాంబోలో సినిమా రావడం కూడా సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఆనందానికి కారణం.
ఇదిలా ఉండగా ఈ సినిమా ఇటీవలే షూట్ స్టార్ట్ చేసుకుని ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది.ఇక సెకండ్ షెడ్యూల్ కోసం కూడా రెడీ అవుతున్నారు.
డిసెంబర్ మొదటి వారంలో ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ కోసం సెట్స్ మీదకు వెళ్లనుంది.త్రివిక్రమ్ మహేష్ కోసం మంచి పవర్ ఫుల్ స్టోరీని సిద్ధం చేసినట్టు టాక్.
మహేష్ గత కొన్నాళ్లుగా క్లాస్ హీరోగానే రాణిస్తున్నాడు.
మరి చాలా రోజుల తర్వాత మహేష్ కూడా ఫుల్ లెన్త్ మాస్ రోల్ లోనే నటించ బోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి.
ఇక ఈ సినిమాలో మహేష్ కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది అని ఎప్పుడో ఫిక్స్ చేసారు.అలాగే హారిక హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
అయితే ఈ సినిమా షూటింగ్ వర్క్ ఇంకా పూర్తి కాలేదని.అలాగే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి అవ్వడానికి జూన్ వరకు అయినా పడుతుంది అని అందుకే ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ చేయడానికి అవ్వదని.అందుకే ఆగస్టుకు వాయిదా వేసినట్టు ఒక వార్త వైరల్ అయ్యింది.
అయితే ఈ వార్తపై ఇప్పుడు నెట్టింట క్లారిటీ గా మరో వార్త వినిపిస్తుంది.ఈ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని సెకండ్ షెడ్యూల్ ను దాదాపు 40 రోజుల పాటు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
ఈ లాంగ్ షెడ్యూల్ లోనే దాదాపు షూట్ పూర్తి చేస్తారని.మిగిలిన పార్ట్ ను మరో షెడ్యూల్ లో పూర్తి చేసి అనుకున్న సమయానికే రిలీజ్ చేస్తారని తాజా బజ్.మరి ముందు ముందు ఏం జరుగుతుందో తెలియదు కానీ రోజు ఈ సినిమా గురించి మాత్రం ఏదొక వార్త వైరల్ అవుతూనే ఉంది.