తెలంగాణ గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై సీపీఐ తెలంగాణ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.మంత్రులను తన కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నానని గవర్నర్ అన్నారన్నారు.
మీరు గవర్నరా లేక బీజేపీ కార్యకర్తనా.? అని కూనంనేని ప్రశ్నించారు.తమిళనాడు, కేరళ, ఢిల్లీ, తెలంగాణలో గవర్నర్ల తీరు సరిగా లేదని విమర్శించారు.గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.తమిళిసై తెలంగాణను వదిలి వెళ్లిపోవాలని పేర్కొన్నారు.ఈ మేరకు త్వరలోనే రాజ్ భవన్ ను ముట్టడిస్తామని కూనంనేని వెల్లడించారు.