టీఆర్ఎస్, బీజేపీ విమర్శలపై సీఈవో వికాస్ రాజ్ స్పందన

మునుగోడు ఉపఎన్నిక ఫలితాలు వెల్లడిలో ఆలస్యం జరుగుతుందని టీఆర్ఎస్, బీజేపీ విమర్శలు చేసిన విషయం తెలిసిందే.ఈ వ్యాఖ్యలను ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ ఖండించారు.

 Ceo Vikas Raj's Response To The Criticism Of Trs And Bjp-TeluguStop.com

కౌంటింగ్ పారదర్శకంగా జరుగుతోందని, ఎలాంటి అవకతవకలు జరగడం లేదని తెలిపారు.ఫలితాల ప్రక్రియలో ఎలాంటి ఆలస్యం లేదని చెప్పారు.

ప్రతి టేబుల్ వద్ద పార్టీ అభ్యర్థుల ఏజెంట్లు ఉన్నారని తెలిపారు.ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి కొంత ఆలస్యం జరుగుతోందని వెల్లడించారు.

మొత్తం బరిలో 47 మంది అభ్యర్థులున్నారని చెప్పారు.ప్రతి అభ్యర్థి ఫలితాలు చూడాలని, అందుకే ఆలస్యం అవుతోందని పేర్కొన్నారు.

వెరిఫై చేసిన తర్వాతే ఫలితాలను అధికారికంగా అందిస్తామన్నారు.ప్రతి రౌండ్ కు అరగంటకు పైగా సమయం పడుతోందని తెలిపారు.

ఇందుకు గానూ మొత్తం 8 గంటల సమయం పడుతుందని ఆయన స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube