తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసు విచారణ వాయిదా పడింది.ఈ కేసును విచారించేందుకు స్వీకరించిన తెలంగాణ హైకోర్టు విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
ఈ క్రమంలో ఆడియోలు, వీడియోలు బయటకు రావడంపై కోర్టు ఆరా తీసింది.కేసుకు సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు అయ్యే వరకు ఆడియోలు, వీడియోలు బయటకు రాకూడదు కదా అని న్యాయస్థానం ప్రశ్నించింది.
అనంతరం తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.