ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతాన్ని ఇస్తూ ఆర్బీఐ డిజిటల్ రూపీని ప్రారంభించనుంది.రేపటి నుంచి హోల్సేల్ విభాగంలో ఈ డిజిటల్ రూపీని ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
సెకంటరీ మార్కెట్ లో ప్రభుత్వ సెక్యూరిటీల్లో లావాదేవీలను దీన్ని ఉపయోగించనుంది.ఎస్బీఐ, బీఓబీ, యూబీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, ఎస్ బ్యాంక్, కొటక్ మహీంద్రా బ్యాంకులు పైలెట్ ప్రాజెక్టులో పాల్గొంటాయని పేర్కొంది.
అదేవిధంగా రిటైల్ అవసరాలకు సంబంధించి డిజిటల్ రూపీని నెల రోజుల్లో ఆర్బీఐ ప్రారంభించనుంది.







