మంచిర్యాల జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.వేమనపల్లి మండలంలో పోడు రైతుల మధ్య వాగ్వివాదం చెలరేగింది.
భూమి తమదంటే తమదని కారం పొడి చల్లుకున్న పోడు రైతులు పరస్పరం కర్రలు, కత్తులతో దాడులకు పాల్పడ్డారు.ఈ దాడిలో సుమారు 20 మందికి పైగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలకు సర్ది చెప్పారు.అనంతరం రెండు వర్గాలకు చెందిన సభ్యలకు కౌన్సిలింగ్ ఇచ్చారు.







