అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ లో కీలక మార్పులు చోటు చేసుకొన్నాయి.పేదల ఇళ్ల కోసం జోన్ ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.
సీఆర్డీఏ సమర్పించిన ప్రత్తిపాదనల మేరకు ఆర్ -5 జోన్ ఏర్పాటు కానుంది.ఐదు గ్రామాల పరిధిలోని 900.97 ఎకరాలు కేటాయిస్తారు.కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, మందడం, ఐనవోలు గ్రామాల్లో ఆర్ -5 జోన్ ఉంటుందని తెలిపింది.
నవంబర్ 11 వరకు సీఆర్డీఏ అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వం వెల్లడించింది.







