యాదాద్రి జిల్లా కొండమడుగు దగ్గర భారీ అగ్నిప్రమాదం సంభవించింది.చందక్ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో పాటు దట్టమైన పొగ అలుముకుంది.సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
దీంతో కంపెనీలోని కార్మికులు తీవ్ర భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు.అయితే ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.







