ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా మారుమోగుతున్న పేరు కాంతార.ఇండస్ట్రీలో చూసినా కూడా ప్రస్తుతం కాంతార సినిమా మేనియానే కనిపిస్తోంది.
భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీలలో ఈ సినిమా థియేటర్లలో సక్సెస్ఫుల్ గా కొనసాగుతూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.అంతేకాకుండా ఈ సినిమాతో రిషబ్ శెట్టి అన్ని వర్గాల ప్రేక్షకులకు అని ఇండస్ట్రీల ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు.
కాగా కాంతార సినిమాకు రిషబ్ శెట్టి హీరోగా దర్శకుడుగా వ్యవహరించిన విషయం తెలిసిందే.కర్ణాటక ఆదివాసి సాంప్రదాయాన్ని తెరపై అద్భుతంగా చూపించాడు రిషబ్ శెట్టి.
మరి ముఖ్యంగా సినిమాలో క్లైమాక్స్ సీన్ ను అన్ని వర్గాల ప్రేక్షకులను తెప్పించింది.ఇకపోతే ఈ సినిమాలో రిషబ్ శెట్టి తల్లి పాత్రలో నటించిన ఆమె ఎవరు అన్న విషయంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చలు కొనసాగుతున్నాయి.
కాగా కాంతార సినిమాలో తన కుమారుని సంతోషాన్ని ఆశించే ఒక మహిళ అనే కమల పాత్రలో నటించింది.ఈ సినిమాతో ఆమె బాగా ఫేమస్ అవడంతో అందరి దృష్టి ఆమెపై పడింది.
దీంతో ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసుకునే పనిలో పడ్డారు నెటిజన్స్.అలాగే ఆమె ఇంతకుముందు ఏదైనా సినిమాలలో నటించిన అన్న విషయాల పట్ల కూడా ఎంక్వయిరీ చేశారు.
ఈ నేపథ్యంలోనే ఆమెకు సంబంధించిన కొన్ని వివరాలు వెలుగులోకి వచ్చాయి.

ఆమె పేరు మానసి సుధీర్.లాక్ డౌన్ సమయంలో ఆమె సోషల్ మీడియా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇటీవల కాలంలో తల్లి పాత్రలో ఎక్కువగా ప్రాధాన్యత పెరుగుతున్న విషయం తెలిసిందే.
ఇక కాంతార సినిమాలో మానసి సుధీర్, కమల అనే పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.అయితే ఆమె మామూలుగా ఉపాధ్యాయులు కాగా లాక్డౌన్ సమయంలో యూట్యూబ్ ఛానల్ ద్వారా తన పిల్లలకు పాటలను బోధించింది.
ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ఆమె నటనను చూసి ఈమెకు ముందు ముందు మంచి మంచి అవకాశాలువస్తాయి అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.







