టీడీపీ ముసుగులోనే అమరావతి రైతుల పాదయాత్ర కొనసాగుతుందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.యాత్ర పేరుతో విద్వేషాలను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
స్వార్థ ప్రయోజనాలు, సొంత లాభం కోసమే అమరావతి యాత్ర చేపట్టారని అంబటి విమర్శించారు.సూర్య దేవాలయం వరకు పాదయాత్ర చేరుకోదన్న ఆయన మర్యాదగా పాదయాత్ర మానుకుని మీ చంద్రుడి వద్దకు వెళ్లాలని హితవు పలికారు.
ఈ సందర్భంగానే రాష్ట్రంలో చంద్రబాబు ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు అయినా ప్రారంభించారా? అని ప్రశ్నించారు.ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టులు ప్రారంభించింది దివంగత నేత వైఎస్ఆర్ అని చెప్పారు.
అందుకే ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకి లేదని పేర్కొన్నారు.







