మహారాష్ట్ర మాజీ మంత్రి అనిల్ దేశ్ముఖ్కు ఊరట లభించింది.దేశ్ముఖ్ బెయిల్ ను వ్యతిరేకిస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన పిటిషన్ పై ధర్మాసనం విచారణ జరిపింది.
ఈ క్రమంలో ఈడీ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది.మనీలాండరింగ్ కేసులో దేశ్ముఖ్కు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో ఈడీ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈడీ కేసులో దేశ్ముఖ్కు బెయిల్ లభించినప్పటికీ గత ఏడాది ఏప్రిల్ లో అతడిపై నమోదైన సీబీఐ కేసుకు సంబంధించి ఇంకా కస్టడీలోనే ఉన్నట్లు సమాచారం.







