వికేంద్రీకరణపై ఎంపీ విజయసాయిరెడ్డి హాట్ కామెంట్స్

వికేంద్రీకరణ పై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.విశాఖకు పరిపాలన రాజధాని రాకుండా కుట్రలు పన్నుతున్నారన్నారు.

 Mp Vijayasai Reddy Hot Comments On Decentralization-TeluguStop.com

ఉత్తరాంధ్రకు ద్రోహం చేసేందుకు దిగజారి వ్యవహరిస్తున్నారని విమర్శించారు.దసపల్లా భూములు వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పునే అమలు చేశామని చెప్పారు .ప్రభుత్వ నిర్ణయంతో సుమారు 400 కుటుంబాలకు న్యాయం జరిగిందన్నారు.అనంతరం చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారి ఆస్తులు శాఖలో ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.

తనకు అక్కడ ఒక ఫ్లాట్ మాత్రమే ఉందని వెల్లడించారు.ఈ నేపథ్యంలో ఆస్తులు ఎంక్వయిరీపై టిడిపికి విజయ్ సాయి సవాల్ విసిరారు.

తన ఆస్తులపై సిబిఐ, ఈడి విచారణకు సిద్ధమన్న ఆయన.టిడిపి కూడా విచారణకు సిద్ధమా అని ప్రశ్నించారు.ఇద్దరం కోర్టులోనే తేల్చుకుందామని చెప్పారు.ఎవరు జైలుకు వెళ్తారు న్యాయస్థానమే నిర్ణయిస్తుందని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube