అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఉక్రెయిన్- రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో అణ్వాయుధాల వినియోగంపై ఆయన మాట్లాడారు.
ఉక్రెయిన్ పై గత కొన్ని నెలలుగా రష్యా భీకర దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే.దీంతో తక్షణం శాంతియుతంగా యుద్ధానికి ముగింపు పలకాలని ట్రంప్ పిలుపునిచ్చారు.
అజ్ఞానుల కారణంగా భూమిపై ఏమీ మిగలదన్న ఆయన శాంతియుతంగా చర్చలు జరిపి ముగింపు పలకాలని డిమాండ్ చేయాలన్నారు.లేదా మూడో ప్రపంచ యుద్ధంతోనే ముగుస్తుందని హెచ్చరించారు.
అణ్వాయుధాల వినియోగంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేసిన హెచ్చరికలు అనంతరం ట్రంప్ స్పందిండం సంచలంగా మారింది.







