హైదరాబాద్ లో రాహుల్ యాత్ర నేపథ్యంలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో రసాభాస జరిగింది.మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ నేతల మధ్య అగ్గి రాజుకుంది.
మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, సంజీవ రెడ్డిల మధ్య వాగ్వివాదం జరిగినట్లు తెలుస్తోంది.నారాయణఖేడ్ లో కాంగ్రెస్ పార్టీ ఓటమిపై పరస్పరం విమర్శలు చేసుకున్నారు.
ఈ క్రమంలో ఇద్దరు నేతలకు పార్టీ పెద్దలు సర్దిచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగినట్లు సమాచారం.







