చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో గజరాజులు హల్చల్ చేస్తున్నాయి.పంట పొలాలను ధ్వంసం చేస్తూ ఏనుగుల గుంపు బీభత్సం సృష్టిస్తోంది.
ఏనుగుల దాడిలో వరి,అరటి, బీన్స్ పంటలు నాశనం అయ్యాయని రైతులు వాపోతున్నారు .గత వారం రోజులుగా మండలంలో ఏనుగులు సంచరిస్తున్నాయి దీంతో సమీప గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.ఫారెస్ట్ అధికారుల స్పందించి తమను, తమ పంట పొలాలను కాపాడాలని కోరుతున్నారు.







