తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల సవాల్ విసిరారు.మీ పాలన అద్భుతమని మీరు అంటున్నారు.
కానీ, మీ పాలన అద్భుతమైతే నాతో ఒక్క రోజు పాదయాత్రకి రండి అని పిలుపునిచ్చారు.సమస్యలు ఉన్నాయని చూపిస్తానన్న షర్మిల, సమస్యలు లేవని రుజువైతే ముక్కు నేలకు రాసి ఇంటికి వెళ్తానని చెప్పారు.
సమస్యలుంటే మీ ముక్కు నేలకు రాసి రాజీనామా చేయండి అంటూ ఛాలెంజ్ చేశారు.ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేయండి అంటూ డిమాండ్ చేశారు.
మీ పాలన మీద ఏ మాత్రం నమ్మకం ఉన్నా తన సవాల్ ను స్వీకరించాలని షర్మిల స్పష్టం చేశారు.