మహేష్ బాబు కృష్ణను పరామర్శించిన మెగాస్టార్.. ఫోటో వైరల్!

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా దేవి అనారోగ్య సమస్యల కారణంగా బుధవారం ఉదయం మరణించిన విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈమె మరణ వార్త విన్న సెలెబ్రిటీలు తన నివాసానికి చేరుకొని ఇందిరా దేవి మృతికి సంతాపం తెలిపారు.

 Megastar Mahesh Babu Visited Krishna Photo Viral Megastar ,mahesh Babu, Krishna-TeluguStop.com

ఈ క్రమంలోనే వెంకటేష్ నాగార్జున మోహన్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి వాళ్లు కృష్ణ ఇంటికి చేరుకొని ఇందిరా దేవి మృతికి సంతాపం ప్రకటించారు.ఇక నేడు మెగాస్టార్ చిరంజీవి కృష్ణ ఇంటికి చేరుకొని కృష్ణతో పాటు మహేష్ బాబులను కలిసి వారికి ఓదార్చి ధైర్యం చెప్పారు.

ఇందిరా దేవి మరణ వార్త తెలుసుకున్నటువంటి మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సంతాపం ప్రకటించారు.

శ్రీమతి ఇందిరా దేవి గారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలిచి వేసింది.

ఆ మాతృదేవత ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ సూపర్ స్టార్ కృష్ణ గారికి సోదరుడు మహేష్ బాబు కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతి అంటూ సోషల్ మీడియా వేదికగా ఈయన సంతాపం ప్రకటించారు.అయితే బుధవారం మెగాస్టార్ చిరంజీవి కృష్ణ ఫ్యామిలీని కలవలేని నేపథ్యంలో నేడు వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారుమెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో బుధవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను అనంతపురంలో నిర్వహించారు.

ఈ వేడుక ఉన్న కారణంగానే మెగాస్టార్ చిరంజీవి మహేష్ బాబు ఇంటికి వెళ్లలేక పోయారు.ఇలా బుధవారం కుదరని నేపథ్యంలో నేడు మహేష్ ఇంటికి చేరుకున్న మెగాస్టార్ కృష్ణ మహేష్ బాబులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు.ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube