స్టాక్ మార్కెట్లలో నష్టాల పర్వం కొనసాగుతోంది.ఈరోజు కూడా మార్కెట్లు భారీగా నష్టపోయాయి.
అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు వరుసగా ఆరో సెషన్ లో కూడా నష్టాలను మూటకట్టుకున్నాయి.ఆర్థికమాంద్యం వచ్చే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో… మానిటరీ పాలసీని మరింత కఠినతరం చేస్తామని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చేసిన ప్రకటన మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపింది.
ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 509 పాయింట్లు నష్టపోయి 56,598కి పడిపోయింది.నిఫ్టీ 148 పాయింట్లు కోల్పోయి 16,858కి దిగజారింది.
హెల్త్ కేర్, ఐటీ, టెక్, ఆటో సూచీలు మినహా అన్ని సూచీలు నష్టాల్లో ముగిశాయి.