సాధారణంగా మోకాలి కింది నుంచి కాలు అనేది పాడైపోతే దాని స్థానంలో ఒక మోకాలు అమర్చుకుంటారు.అయితే డబ్బులు ఉన్నవారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది ఎందుకంటే మార్కెట్లో ఒక్క ఆర్టిఫిషియల్ లింబ్ రూ.10 లక్షల నుంచి రూ.60 లక్షల ధరలు పలుకుతోంది.అయితే ఈ కృత్రిమమైన మోకాలును చాలా తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సిద్ధమయ్యింది.ఇందులో భాగంగా ఇప్పటికే మైక్రో ప్రాసెసర్తో నడిచే ఓ కృత్రిమ మోకాలిని అభివృద్ధి చేసింది.
కాగా దీని కమర్షియల్ ప్రొడక్షన్ ప్రారంభం కావాల్సి ఉంది.అదే జరిగితే రూ.4 లక్షల నుంచి రూ.5 లక్షల ధర లోపు కృత్రిమ మోకాలు కొనుగోలు చేయడం సాధ్యమవుతుంది.
ఈ కృత్రిమ మోకాలను మైక్రో ప్రాసెసర్ కంట్రోలర్ మోకాలు (ఎంపీకే) అని ఇస్రో పేరు పెట్టింది.చాలా లైట్ వెయిట్ గా ఉండే ఈ ఆర్టిఫిషియల్ లింబ్ జస్ట్ 1.6 కేజీలు అని ఇస్రో వెల్లడించింది.కాళ్లు లేని దివ్యాంగులకు ఈ ఎంపీకే పరికరం ఎంతగానో హెల్ప్ అవుతుందని ఇస్రో తెలిపింది.
అంతేకాదు, మార్కెట్లోని కృత్రిమ అవయవాలతో కంపేర్ చేస్తే ఈ ఎలక్ట్రానిక్ మోకాలు ధర 10 రేట్లు చౌక అని ఇస్రో పేర్కొంది.దీని సహాయంతో దివ్యాంగులు 100 మీటర్ల మేర ఎలాంటి సపోర్ట్ లేకుండా నడవగలుగుతారు అని ఇస్రో చెబుతోంది.
ఫలితంగా నడవాలనే దివ్యాంగుల కల నిజం అవుతుంది.
ఈ ఎంపీకేలో మైక్రోప్రాసెసర్, హైడ్రాలిక్ డంపర్, లోడ్, మోకాలి యాంగిల్ సెన్సార్లు, కాంపోజిట్ నీ-కేస్, లి-అయాన్ బ్యాటరీ, ఎలక్ట్రికల్ జీను, ఇంటర్ఫేస్ ఎలిమెంట్స్ ఉంటాయి.
వీటన్నిటి సహాయంతో ఆ ఆర్టిఫిషియల్ మోకాలు దివ్యాంగులు నడుస్తున్నప్పుడు మంచి అనుభూతిని అందిస్తుంది.







