కొత్త పట్టాలు ఇస్తున్నారని అటవీ భూమి కబ్జా చేస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.అటవీ, పోడు భూముల సమస్యపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో కొందరు ప్రజా ప్రతినిధులే కబ్జాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.అధికారులు పేద వారికి న్యాయం చేయాలని సూచించారు.
ఈ డిసెంబర్ నెలాఖరు లోపు పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.







