కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న బీజేపీ మూడోసారి కూడా అధికారంలోకి వచ్చేందుకు వ్యూహాలు రచిస్తోంది.2024 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్లమెంట్ ప్రవాస్ యోజన చేపట్టింది.ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.దీనిలో భాగంగా మూడు రోజులపాటు కేంద్రమంత్రులు రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.చేవెళ్ల, వరంగల్ పార్లమెంట్ పరిధిలో ప్రహ్లాద్ జోషి, బీఎల్ వర్మ పర్యటిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.కేంద్ర పథకాల అమలు పర్యవేక్షణ లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు