కోలీవుడ్ లో ఇప్పటి వరకు 100 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ సినిమాలు చేయడానికి ఏ డైరెక్టర్ కానీ ఏ నిర్మాత కానీ ముందుకు రాలేదు.అయితే ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీ నుండి కూడా ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వస్తుంది.
అదే పొన్నియన్ సెల్వన్. ఈ సినిమాను తమిళ్ బాహుబలి అంటూ అక్కడి మీడియా ప్రచారం చేస్తుంది.
ఈ సినిమా బాహుబలి రేంజ్ లో ఉంటుంది అని రెండు పార్టులు కలిసి బాహుబలి కలెక్షన్స్ ను బీట్ చేస్తుంది అంటూ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ సినిమాపై కొద్దిగా అంచనాలు అయితే ఏర్పడ్డాయి.ఈ సినిమాను మావెరిక్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్నాడు.
ఈయన డ్రీమ్ ప్రాజెక్ట్ అయినా ఈ సినిమాను ఎప్పటి నుండో తెరకెక్కించాలి అని అనుకున్న ఇప్పటికి అది సాధ్యం అయ్యింది.
ఈ సినిమాలో చియాన్ విక్రమ్, హీరో కార్తీ, జయం రవి, త్రిష, ఐశ్వర్య రే, శోభిత దూళిపాళ్ల వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమాపై హైప్ ఏర్పడడంతో అందరు ఎలా ఉండబోతుందా అని ఎదురు చూస్తున్నారు.
మరి కొద్దీ రోజుల్లో రిలీజ్ కాబోతున్న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు భారీగా ప్రొమోషన్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తెలుగులో కూడా వరుస ప్రొమోషన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.ఈ ప్రొమోషన్స్ లో భాగంగానే ఈ సినిమా కోసం తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించ బోతున్నట్టు తెలుస్తుంది.
హైదరాబాద్ లో పొన్నియన్ సెల్వన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 23న సాయంత్రం 5 గంటల నుండి JRC కన్వెన్షన్స్ లో జరగనుంది.ఇక సెప్టెంబర్ 30న రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.