ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర అప్పులపై సీఎం జగన్ వివరణ ఇచ్చారు.కేంద్రంతో పోలిస్తే రాష్ట్ర అప్పులు తక్కువగానే ఉన్నాయన్నారు.చంద్రబాబు హయాంలో అప్పులు 17.45 శాతం పెరిగాయని చెప్పారు.అదేవిధంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో కేంద్ర రుణాలు రూ.135 లక్షల కోట్లకు పెరిగాయని తెలిపారు.
విభజన నాటికి రాష్ట్ర రుణాలు రూ.1.26 లక్షల కోట్లన్న సీఎం జగన్.టీడీపీ ప్రభుత్వం దిగిపోయే సమయానికి రూ.2.69 లక్షల కోట్లని పేర్కొన్నారు.అదేవిధంగా ఈ మూడేళ్లలో రాష్ట్ర రుణాలు రూ.3.82 లక్షల కోట్లకు పెరిగాయని స్పష్టం చేశారు.







