భారత్ జూడో యాత్రలో బీజేపీ పై రాహుల్ సీరియస్ వ్యాఖ్యలు..!!

కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు దాదాపు 3 వేల కిలోమీటర్లకు పైగా రాహుల్ పాదయాత్రగా ప్రజల కష్టాలను తెలుసుకోవడానికి నడుస్తూ ఉన్నారు.

 Rahul's Serious Comments On Bjp In Bharat Jodo Yatra Rahul Gandhi, Bjp, Bharat J-TeluguStop.com

దేశంలో అన్ని రాష్ట్రాలను కవర్ చేసే రీతిలో చేస్తున్న ఈ పాదయాత్ర ప్రస్తుతం కేరళలో జరుగుతుంది.ఈ సందర్భంగా కేరళ భారత్ జూడో యాత్రలో బీజేపీ పై రాహుల్ గాంధీ సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

మన దేశానికి సంబంధించి వెయ్యి కిలోమీటర్ల భూభాగాన్ని.ప్రధాని మోడీ చైనాకి అప్పగించారని ఆరోపించారు.ఈ భూభాగాన్ని తిరిగి ఎలా స్వాధీనం చేసుకుంటారో… కేంద్రం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.భారత్ జూడో యాత్రలో రాహుల్ బీజేపీ పై భారీ ఎత్తున విమర్శల దాడి చేస్తున్నారు.

ఇదే సమయంలో రాహుల్ గాంధీ పాదయాత్రకి అన్ని వర్గాల ప్రజల నుండి మద్దతు బాగానే లభిస్తుంది. ఈ పాదయాత్రతో దేశంలో కాంగ్రెస్ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube