కెనడాలో విషాదం చోటు చేసుకుంది.రోడ్డు ప్రమాదంలో పంజాబీ యువకుడు దుర్మరణం పాలయ్యాడు.
మృతుడిని జగ్సిర్ సింగ్ గిల్ (28)గా గుర్తించారు.ఇతను ఓ ట్రక్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
మృతుడు భార్య, తన ఇద్దరు పిల్లలతో కలిసి కలగరీలో నివసిస్తున్నాడు.ఆదివారం బ్రిటీష్ కొలంబియాలోని గోల్డెన్ ఏరియాలో నేషనల్ హైవే 1పై జంతువులను తీసుకెళ్తున్న ట్రక్ ఓవర్టేక్ చేస్తూ అతని ట్రక్ని ఢీకొట్టింది.
దీంతో జగ్సిర్ ట్రక్కు బోల్తా పడటమే కాకుండా రెండు వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి.ఈ ప్రమాదంలో అతని శరీరం పాక్షికంగా కాలిపోయిందని… ఈ గాయాలతోనే జగ్సిర్ ప్రాణాలు కోల్పోయినట్లు అతని తండ్రి కుల్వంత్ సింగ్ పేర్కొన్నారు.
మరో ట్రక్కు డ్రైవర్ కూడా కాలిన గాయాలతోనే చనిపోయాడని.అతడిని ఇంకా గుర్తించాల్సి వుందని పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాదం కారణంగా ట్రాన్స్- కెనడా హైవేను తాత్కాలికంగా మూసివేశారు అధికారులు.
ఇకపోతే.
గత నెలలో టొరంటోలోని నైట్ క్లబ్లో జరిగిన కాల్పుల ఘటనలో భారత సంతతికి చెందిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు.మృతుడిని 26 ఏళ్ల సిక్కు సంతతికి చెందిన పర్దీప్ బ్రార్గా గుర్తించారు.
ఇతను బ్రాంప్టన్లో నివసిస్తున్నాడు.ఈ ఘటనలో 24 ఏళ్ల యువతి కూడా గాయపడిందని.
ఆమెను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.బాథర్ట్స్ స్ట్రీట్ సమీపంలోని 647 కింగ్ సెయింట్ డబ్ల్యూ వద్ద ఈ ఘటన జరిగినట్లు టొరంటో పోలీసులు తెలిపారు.దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు తెల్లవారుజామున 3.33 గంటలకు సంఘటనాస్థలికి చేరుకున్నారు.టొరంటో పారామెడిక్స్ .కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడ్డ బ్రార్, మరో మహిళను ఆసుపత్రికి తరలించారు.అయితే ఈ కాల్పులు జరగడానికి కారణాలు తెలియరాలేదు.
మరోవైపు.ఈ ఏడాది ఏప్రిల్లోనూ ఓ భారతీయ విద్యార్ధిని కెనడాలో ఓ ఆగంతకుడు కాల్చి చంపిన సంగతి తెలిసిందే.టొరంటోని సెయింట్ జేమ్స్ టౌన్లోని షెర్బోర్న్ టీటీసీ స్టేషన్ సమీపంలోని గ్లెన్ రోడ్ ఎంట్రన్స్ వద్ద కార్తీక్ వాసుదేవ్ అనే యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపాడు.
దీంతో తీవ్ర గాయాలపాలై కుప్పకూలిన కార్తీక్కు ఆఫ్ డ్యూటీలో వున్న పారామెడిక్ ఒకరు ప్రథమ చికిత్స అందించి.హుటుహుటీన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు.
అక్కడ చికిత్స పొందుతూ అతను కన్నుమూశాడు.







