టాలీవుడ్ డైరెక్టర్ శంకర్ గురించి మనందరికీ తెలిసిందే.టాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు డైరెక్టర్ గా వ్యవహరించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
శంకర్ పృథ్వి గారు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది అతిధి.మొదట తమిళ స్టార్ హీరో కార్తీ హీరోగా నటించిన విరుమన్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అతిధి.
కాగా ఈ సినిమా ఆగస్టు 12వ తేదీన విడుదలైన విషయం తెలిసిందే.భారీ అంచనా నడుమ విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి బాగానే రెస్పాన్స్ అందుకుంటోంది.
సినిమా విడుదల అయ్యి మంచి సక్సెస్ ని సాధించిన సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా టీమ్ తమిళనాడులోని ఒక సినిమా థియేటర్ కు వెళ్ళింది.
అక్కడ ప్రేక్షకులతో కలిసి ముచ్చటించారు.ఈ నేపథ్యంలోనే హీరోయిన్ అతిధి శంకర్ చెప్పిన ఒక జోక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఆ జోక్ పై నెటిజన్స్ ఫైర్ అవుతూ విపరీతంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు.అదితి శంకర్ చెప్పిన జోక్ ఏమిటంటే.
ఆదివారం రోజు గొడవ పడొచ్చు.కానీ సోమవారం రోజు చనిపోగలమా అంటూ జోక్ చేసింది.
ఇదే డైలాగ్ ని ఆమె తమిళంలో చెప్పారు.

దీంతో నెటిజెన్స్ జోక్ ఆఫ్ ది ఇయర్ అంటూ ట్రోలింగ్స్ చేయడం మొదలుపెట్టారు.పాపం మొదటిసారిగా బయట ప్రపంచాన్ని చూస్తున్నట్లు ఉంది.అందుకే దాన్ని జోక్ అనుకుంటుంది.
ఆమె పిచ్చివాగుడు తట్టుకోలేకనే శంకర్ సినిమాల్లోకి పంపినట్లు ఉన్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే ప్రస్తుతం అతిది శంకర్ మావిరన్ సినిమాలో నటిస్తోంది.ఈ సినిమా నవంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
అయితే డైరెక్టర్ శంకర్ కూతురుగా ఎంట్రీ ఇచ్చిన అతిధి శంకర్ మరి ఏ మేరకు సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటుందో చూడాలి మరి.







