మరోసారి మన తెలుగు సినిమా నుండి కంటెంట్ ఓరియెంటెడ్ సినిమా వచ్చింది.అది కూడా మన దగ్గర కంటే నార్త్ లో సెన్సేషనల్ క్రియేట్ చేస్తుంది.
మన తెలుగు సినిమా తెలుగులో అంతగా బ్లాక్ బస్టర్ అవ్వక పోయిన అక్కడ మాత్రం హిందీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టు కుంటుంది.అది కూడా అక్కడి సినిమాలను పక్కన మరీ మన సినిమాలను చూస్తున్నారు.
కార్తికేయ 2 సినిమా 50 స్క్రీన్ లతో స్టార్ట్ అయ్యి ఇప్పుడు రోజుకి 1000 కి పైగానే స్క్రీన్ లకు చేరుకొని సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.టోటల్ గా ఈ సినిమా 3000 షోస్ మార్క్ ను క్రాస్ చేసి చిన్న సినిమాల్లోనే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.
మన సినిమాల్లో బాహుబలి తర్వాత కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు వస్తున్నాయి.
ఈ క్రమంలోనే వచ్చిన పుష్ప, ఆర్ ఆర్ ఆర్ సినిమాలు నార్త్ ప్రేక్షకులను బాగా ఆకట్టు కున్నాయి.
అలాగే కలెక్షన్స్ కూడా 100 కోట్లకు పైగానే సాధించి సంచలనం సృష్టించాయి.ఇక ఈ భారీ బడ్జెట్ సినిమాల తర్వాత అంతటి రేంజ్ లో అలరిస్తున్న సినిమాగా కార్తికేయ 2 రికార్డు కెక్కింది.
చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిఖిల్ కెరీర్ కు బూస్ట్ ఇచ్చింది.నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా కార్తికేయ 2.ఆగష్టు 13న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యి అంతటా సంచలనం సృష్టిస్తూ రికార్డు కలెక్షన్స్ రాబడుతూ మరోసారి టాలీవుడ్ పేరు మారుమోగి పోయేలా చేస్తుంది.మరి ఈ వసూళ్ల సునామీ ఎక్కడ ఆగుతుందో చూడాలి.