టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పై బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.జనగామలో నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు.
పోలీసులను అడ్డుపెట్టుకుని టీఆర్ఎస్ గుండాగిరి చేస్తోందని ఆరోపించారు.ఎంతమందిని తెచ్చుకున్నా, ఎన్ని దాడులు చేసినా భయపడేది లేదన్నారు.
అనంతరం కాషాయదళంతో బలప్రదర్శనకు సిద్ధమా అని ప్రశ్నించారు.తాము హిందూ ధర్మం కోసమే పని చేస్తున్నామని చెప్పారు.
రాష్ట్రంలో కేంద్రం నిధులతోనే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు.బీజేపీ ఏ మతానికి, ప్రాంతానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.







