ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం తిమ్మాయిపాలెంలో డంపింగ్ యార్డ్ లో ఉన్న మహాత్మాగాంధీ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.ఈ సంఘటనపై చేబ్రోలు పోలీస్ స్టేషన్ లో గ్రామ సర్పంచ్ ఫిర్యాదు చేశారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ క్రమంలో విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.