యాదాద్రి భువనగిరి జిల్లాలో టీఆర్ఎస్ కు షాక్ తగిలింది.చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్ రెడ్డి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు.
హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు.
అయితే మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఇవ్వద్దంట అసమ్మతి నేతలను లీడ్ చేశారు వెంకట్ రెడ్డి.
ఈ క్రమంలోనే భూ వివాదాలతో ఆయనపై చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేసింది, అర్ధరాత్రి సమయంలో అరెస్టుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే.