కర్ణాటకలోని బీదర్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది.బంగూర్ వద్ద జాతీయ రహదారిపై ఓ కంటైనర్ ను కారు వెనుక నుంచి ఢీకొట్టింది.
ఈ ఘటనలో ఓ చిన్నారితో పాటు ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.మరో ఐదుగురికి గాయాలయ్యాయి.
మృతులు హైదరాబాద్ లోని బేగంపేటకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు.మృతులు గిరిధర్, అనిత, ప్రియ, మహేశ్, జగదీశ్ లు ప్రాణాలు కోల్పోయారు.
కలబురిగి జిల్లా గంగాపూర్ దత్తాత్రేయ ఆలయ సందర్శనకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.