మంత్రులు గాల్లోకి కాల్పులు జరపడం తెలంగాణలో రజకార్ల పాలనను తలపిస్తోందని బీజేపీ చీఫ్ బండ సంజయ్ అన్నారు.మునుగోడు ఉప ఎన్నిక నుంచి కాంగ్రెస్, టీఆర్ఎస్ పారిపోయారని విమర్శించారు.
కమ్యూనిస్టులు ఎప్పుడు ఎలా ఉంటారో వారికే తెలీయదని వ్యాఖ్యనించారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ను ఎప్పుడూ విమర్శించలేదని, పార్టీ అధ్యక్షుడిని మాత్రమే విమర్శించారని తెలిపారు.
కాంగ్రెస్ ప్రజల విశ్వాసం కోల్పోయిందని ఎద్దేవా చేశారు.అనంతరం బీజేపీ ఈడీనిక వాడుకోవాలని చూస్తే తెలంగాణలో ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే మిగలరని బండి సంజయ్ వెల్లడించారు.